14వ తేదీ బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు నెల్లూరు జిల్లాలోని పడమటి నాయుడుపల్లి క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. చుంచులూరు వద్ద పాదయాత్ర 1600 కి.మీ పూర్తయిన సందర్భంగా మైలురాయి స్థూపాన్ని నారా లోకేష్ ఆవిష్కరిస్తారు. అనంతరం గోగులపల్లి, అగ్రహారం, బొమ్మవరం మీదుగా అనంతసాగరం మండలం చిలకలమర్రికి చేరుకుంటుంది. ఆ గ్రామంలోనే రాత్రి బస చేస్తారు.
15వ తేదీ సాయంత్రం 4 గంటలకు చిలకలమర్రి నుంచి పాదయాత్ర ఆరంభం అవుతుంది. మమంగుపల్లి, కామిరెడ్డిపాడు, గౌరవరం మీదుగా సంజీవ్నగర్కు చేరుకుని అక్కడ బస చేస్తారు.
16వ తేది సాయంత్రం 4గంటలకు సంజీవ్నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 5 గంటలకు అనంతసాగరంలో బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగిస్తారు. అనంతరం అనంతసాగరం నుంచి మాచాలమల్లి, వరికుంటపాడు,అలుగోడుక్రాస్, ఉప్పలపాడు క్రాస్ రోడ్డు మీదుగా వెంకటగిరి నియోజకవర్గంలో పెన్నా పరివాహక ప్రాంతం వద్ద రాత్రి బస చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa