ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు స్థానిక అంబేడ్కర్ అండ్ బాబుజగ్జీవన్రాం ఆడిటోరియంలో సోమవారం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కల్టెక్టర్ దినేష్కుమార్తో కలసి మంత్రి సురేష్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించాలని కలెక్టరు, జేసీలకు వివరించారు. గ్రామాల్లో ఎక్కువ భూమసమస్యలు ఉన్నా యని వాటి పరిష్కరించాలన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. అర్జీదారులు స్పందన కౌంటరులో ఇచ్చిన రసీదును భద్రపరుచుకోవాలన్నారు. స్పందనలో ఐదు మండలాల ప్రజల నుంచి 327 అర్జీలు ప్రజలు వివిధ సమస్యలపై అందజేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతుమాధవన్, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ మాధురి, డీఎల్డీవో సాయికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa