జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9 గంటలకు అన్నవరం సత్యదేవుడి దర్శనంతో జిల్లాలో యాత్ర మొదలుకానుంది. ప్రజాసమస్యలపై పోరాటం,అధికార వైసీపీ అవినీతి, అక్రమాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సాగనున్న యాత్ర జిల్లాలో నాలుగు నియోజకవర్గాల మీదుగా జరగనుంది. పర్యటనలో కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరం మొత్తం మూడు బహిరంగ సభల్లో పవన్కళ్యాణ్ ప్రసంగించనున్నారు. జిల్లాలో పర్యటన సాగినన్ని రోజులూ ప్రతిరోజూ ఉదయం ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజలనుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. కీలక సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో భాగంగా ఏదొక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ తమకు బాగా పట్టున్న తూర్పు నుంచి పవన్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టడంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణకిసలాడుతోంది. మరోపక్క పవన్ వారాహి యాత్రకు జిల్లా పోలీసుశాఖ కొన్ని షరతులతో కూడిన అనుమ తులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa