ఇందిర , వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మాలలే మీరే చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన మాలల ఆత్మీయ సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ..... కొన్ని వర్గాల ఓట్లు తనకే పడతాయన్నది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ధైర్యమని, ఆ ధైర్యంతోనే అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే కొంతమంది దళిత నేతలే మాట్లాడకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం అండతోనే ఎస్సీలు.. శిరోముండనాలు, హత్యలు, చిత్రహింసలకు గురవుతున్నారని, దళిత మంత్రులు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తేనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa