ఏపీలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి రోజా స్పష్టంచేశారు. హాయ్ ఏపీ, బై బై బీపీ, వన్స్ ఎగైన్ వైసీపీ అంటూ సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఇరిటేషన్ స్టార్ట్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబుకు ఇన్స్పిరేషన్ స్టార్ జగనన్న కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరంటూ రోజా ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రజలు మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని కసితో ఉన్నారన్నారు. రికార్డుల సృష్టించాలన్నా.. ఆయన రికార్డులను బ్రేక్ చేయాలన్నా అయన తప్ప వేరే ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు.
ఇవాళ చిత్తూరు జిల్లా వాసులకు శుభదినమని.. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుట విజయ డైరీకి జగనన్న ప్రాణం పోస్తున్న రోజన్నారు. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలకు వెలుగు నింపిన విధంగా.. చిత్తూరు జిల్లా పాడి రైతుల జీవితాల్లో జగనన్న వెలుగు నింపుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో పుట్టి, చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు సిగ్గుపడాల్సిన రోజన్నారు.
జిల్లా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు.. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి తన సొంత డైరీ హెరిటేజ్ను అభివృద్ధి చేసుకుని పాడి రైతుల జీవితాలు అంధకారం చేశారన్నారు. కానీ తన సొంత జిల్లా కాకపోయినా.. జగన్ ప్రజల కోసం చిత్తూరు జిల్లాని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రూ.183 కోట్లు అప్పుల్లో ఉన్న విజయ డైరీ అప్పులు తీర్చి రూ.385 కోట్లతో అమూల్ సంస్థ ద్వారా పునః ప్రారంభానికి భూమి పూజ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జగనన్నకు జిల్లా వాసులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి రోజా. అలాగే రాష్ట్రంలో అర్హత ఉండి పథకాలు రాని వారిని జల్లెడ పట్టి జగనన్న సురక్ష ద్వారా లబ్ధి చేకూర్చడం ప్రధాన ఉద్దేశమన్నారు మంత్రి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa