మంగళవారం రాత్రి అనగా నిన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ ఏలూరు జిల్లా పర్యటన ముగించుకుని తాడేపల్లిగూడెం చేరుకున్నారు. రాత్రి పెంటపాడు మండలం అలంపురం జయగార్డెన్స్లో బసచేశారు. బుధవారం సాయంత్రం అనగా నేడు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్వీఆర్ జంక్షన్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరుకూ సభ కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలానే రేపు అనగా 13న తణుకు చేరుకుంటారు. అదేరోజు నియోజకవర్గ నాయకులు, వీర మహిళలతో పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు. తణుకులోనే ఆ రోజు రాత్రి బస చేయనున్నారు. 14వ తేదీన తణుకు పట్టణంలోని పైడిపర్రు జంక్షన్ వద్ద బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa