ప్రయాణికులను మరింతగా ఆకట్టుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్కు పోటీగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. టికెట్లపై వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. అలాగే వివిధ పర్యాటక ప్రదేశాలకు స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంి. ఇందులో భాగంగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీని టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రతీ వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ తిప్పనుంది. రెండు రోజల పాటు ఈ టూర్ ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంతో పాటు భ్రమరాంబదేవి, పాతాళగంగ, శ్రీశైలం డ్యాం, శిఖరం, పంచధార, పాలధార, సాక్షి గణపతి ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఈ ప్యాకేజీలో పెద్దలకు టికెట్ ధర రూ.2700గా, పిల్లలకు రూ.1570గా నిర్ణయించారు. ఈ నెల 22న ఈ ప్రత్యేక బస్సులను ప్రారంభించన్నారు. వీకెండ్స్లో హైదరాబాద్లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు ఈ బస్సులు బయలుదేరతాయి. 8 గంటలకు ఎంజీబీఎస్లో అందుబాటులో ఉండనుండగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలంకు చేరుకుంటాయి.
మధ్యాహ్నం 3 గంటలకు పాతాళగంగ సందర్శన, అక్కడ బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మల్లికార్జునస్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కల్పిస్తారు. రాత్రి హోటల్లో బస సదుపాయం కల్పిస్తారు. ఇక తర్వాతి రోజు ఉదయం శ్రీశైలం డ్యాం, పంచధార, పాలధార, శిఖరం, సాక్షి గణపతి ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు హైదరాబాద్కు బస్సు చేరుకుంటుంది. ఆలయ దర్శనం, హోటల్లో వసతి ఈ ప్యాకేజీ ధరలో కల్పిస్తారు. ఆహారం, ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాల్సి ఉంటుంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి శ్రీశైలం ప్రత్యేక ప్యాకేజీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం వెళుతుంటారు. శని, ఆదివారాల్లో శ్రీశైలంకు వెళ్లే బస్సుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు దాదాపు 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. అయినా భక్తుల రద్దీకి తగ్గట్లు బస్సులు సరిపోవడం లేదు. దీంతో మరిన్ని ప్రత్యేక బస్సులను తిప్పనుంది. కాగా ఇప్పటికే తిరుమల వెళ్లేవారు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా అందిస్తోంది. ఇప్పుడు శ్రీశైలం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మల్లికార్జునస్వామివారి దర్శనం కల్పించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa