తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఎంత బంగారం ఉంది.. స్వామివారి ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారో టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఈ మేరకు వారణాసిలో జరిగిన ఆలయాల సమావేశంలో ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఎంత బంగారం ఉంది? ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారు వంటి అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. తిరుమలకు సంబంధించిన పలు ఆసక్తికర సమాచారం వెల్లడించారు. టీటీడీ వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలు.. స్వామి వారికి ఎంత బంగారం ఉంది? ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో ధర్మారెడ్డి వివరించారు.
దేశవ్యాప్తంగా టీటీడీ 71 ఆలయాలను నిర్వహిస్తోందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు అని, వెండి 10 టన్నులు ఉంటుందని వివరించారు. ఏడాదికి శ్రీవారికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీలో 24,500 మంది ఉద్యోగులు ఉండగా, ఆలయంలో భక్తులకు సేవలందించడానికి రోజుకి 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఇక, టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. స్వామి వారి పేరుతో రూ. 17 వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. టీటీడీలో వివిధ శాఖల సిబ్బంది ఎలా పని చేస్తారు? వారి విధివిధానాల గురించి వివరించారు. అంతర్జాతీయ ఆలయాల సమావేశం, ఎగ్జిబిషన్లో 30 దేశాల నుంచి వచ్చిన 1,600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీవాణి ట్రస్టుపై ప్రశంసలు కురిపించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా సేకరించిన నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో టీటీడీ ఆలయాలు నిర్మించడంపై అభినందించారు. చిన్న మధ్య స్థాయి ఆలయాలను గుర్తించి.. ఆ ఆలయ సంప్రదాయాలు, ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల ద్వారా హిందూ మతం విలువలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆలయాల ద్వారా విద్య, వైద్యం వంటి సేవలను ప్రజలకు అందించాలన్నారు. పేదవారి వైద్యానికి ఆలయాల నుంచి సహకారం అందించాలని మోహన్ భగవత్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa