సీఎం జగన్ దళితులని మోసం చేసారని కానీ ఏమి తెలియనట్లు దళితులు మా మామలు అని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడని, దళితుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే రద్దుచేసిన 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని తక్షణం ప్రకటిం చాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మోకాటి నాగేశ్వర రావు డిమాండు చేశారు. మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించి మాదిగలకు ఉపాధి కల్పించాలన్నారు. అమలాపురం , నడిపూడి డాక్టర్ బాబూజగ్జీవన్రామ్ కమ్యూనిటీ హాలులో అయన మాట్లాడుతూ... మణిపూర్లో రెండు నెలలుగా మైనార్టీ ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలపై ప్రధాని మోదీ స్పందించక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాప నాగభూషణం, చాట్ల సత్యనారాయణ, తొత్తరమూడి ప్రభాకరరావు, మంద వెంకటేశ్వరరావు, మోకాటి అమ్మిరాజు, ఉందుర్తి సత్యనారాయణ, నేదునూరి రాజ్కుమార్, కొడమంచిలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa