వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును హనుమాన్ జంక్షన్లో సోమవారం వైసీపీ గన్నవరం నేత, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. అనంతరం నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... రాజకీయంగా గత రెండేళ్లుగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, దాని కారణంగా అజ్ఞాతవాసంలో ఉన్నానన్నారు. కార్యకర్తలకు ఈ రెండేళ్లలో ఏమీ చేయలేకపోయానని, కానీ వారికి అందుబాటులోనే ఉన్నానన్నారు. ‘అమెరికాను వదిలేసి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చా. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశా. ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారు. అయినా నేను అమెరికా వెళ్లలేదు. అయితే, 2024లో గన్నవరం నుంచి పోటీ చేయడం మాత్రం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa