టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి తనను ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం మూలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఇష్టానుసారం అంటారా అంటూ విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు నన్ను ఆంబోతు అన్నప్పుడు ఆయన ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టు కలిపి చదువుకోవాలి’’ అంటూ సెటైర్ విసిరారు. ‘‘నీ ఇంటి పేరు నారా కాదు శని ... శని చంద్రబాబు నువ్వు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు దృష్టిలో శనివి నిన్ను వదిలించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు. పోలవరానికి, రాష్ట్రానికి చంద్రబాబే శని అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి పోలవరం మీద లేదని.. వచ్చే డబ్బుమీద ఉందన్నారు. తమ వారికి కాంట్రాక్టు ఇస్తే డబ్బులు వస్తాయని చంద్రబాబు పోలవరం చుట్టూ తిరిగారన్నారు. ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే చంద్రబాబు వెళ్ళి ప్రెజెంటేషన్ చేస్తే అంగీకరించారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను వదులుకుని పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పుకొచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2013-14 సంవత్సరం రేట్ల ప్రకారం 2016లో ఒప్పుకున్నాకని.. రూ.20,390 కోట్లకు కడతామని చంద్రబాబు ఒప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా వినియోగించుకున్నారని కేంద్రం చెప్పిందన్నారు. ఇప్పడు ప్రాజెక్టు రేటు 2017-18 రేట్లు ప్రకారం రూ.55,656 కోట్లు అయ్యిందని మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa