హిందీ స్థానిక భాషలకు పోటీ కాదని, అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారానే దేశం సాధికారత సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. న్యూఢిల్లీలో అధికార భాషపై పార్లమెంటు కమిటీ 38వ సమావేశానికి హాజరైన షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందీతో పాటు ఇతర భారతీయ భాషలన్నింటిని ప్రపంచ వేదికలపై సగర్వంగా ప్రదర్శిస్తున్నందున భారతీయ భాషల ప్రచారానికి ఇంతకంటే అనుకూలమైన తరుణం మరొకటి ఉండదని అన్నారు. హిందీ స్థానిక భాషలకు పోటీ కాదని, అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారానే దేశం సాధికారత పొందుతుందని షా అన్నారు. 10 భాషల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని, త్వరలోనే ఈ కోర్సులు అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి వస్తాయని హోంమంత్రి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa