ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జనాలు బ్రహ్మరథం పట్టారంటున్నారు రఘురామకృష్ణ రాజు. టీడీపీకి వచ్చిన ఆదరణ చూస్తే.. తలచుకుంటేనే క్రమశిక్షణ కలిగిన తనలాంటి కార్యకర్తల్లో భయం మొదలైందన్నారు. వై నాట్ కుప్పం అంటే.. చంద్రబాబు వైనాట్ పులివెందుల అన్నారన్నారు. వై నాట్ 175 అని మాట్లాడేవారికి నిన్నటి టీజర్తోనే దిమ్మ తిరిగి ఉంటుందన్నారు. టీజర్ గ్రాండ్ సక్సెస్ నిన్నటి పులివెందుల సభ ద్వారా స్పష్టమయ్యిందన్నారు. చంద్రబాబును ముసలివాడు అని సంభోదిస్తున్నారన.. కానీ ఆయనేమో అలవోకగా రెండు మూడు అంతస్తుల బిల్డింగులను ఎక్కుతున్నారన్నారు.
చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను తిరిగి ఒక లెక్చరర్ మాదిరిగా ఈ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శల గురించి నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతారేమోనని అనుకుంటే.. ఆయనేమో బ్రో సినిమా హిట్ కాలేదు అని దీర్ఘాలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పర్యటనల్లో బిజీగా ఉన్నారని.. తాను కూడా త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలిపారు.
రుషికొండపై నిర్మించిన భవన నిర్మాణాలలో ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. రుషికొండపై పూర్తి తీర్పు వచ్చినా.. న్యాయమూర్తులు తమ మనసులోని అభిప్రాయాన్ని చెప్పారన్నారు. టూరిజం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి నివాస భవనాన్ని, కార్యాలయాన్ని నిర్మించుకున్నారన్నారు. దసరాకు రుషికొండపై నిర్మించుకున్న భవనంలోకిఅడుగు పెట్టనున్నట్లు తెలిసిందని.. కొత్తగా విశాఖకు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రుషికొండపై హైకోర్టు ఇచ్చే తీర్పులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పొందుపరచడం ఖాయమన్నారు.
అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించిందన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా జగన్ కాటుకు హైకోర్టు దెబ్బ తగిలిందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళితే వెళ్లొచ్చని.. అక్కడా ఎదురు దెబ్బ తప్పదన్నారు. ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.
రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తమ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ప్రతిపక్ష పార్టీలను గౌరవించడమన్నది నేర్చుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని 'మీ బావ కళ్ళల్లో ఆనందం కోసమా' అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అలాగే అప్పుల విషయంలో ఏదేదో చెబుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పనులను చేసిన కాంట్రాక్టర్లను 10 లక్షల నుంచి మొదలుకొని ఐదు కోట్ల రూపాయల వరకు బిల్లును రావలసిన కాంట్రాక్టర్ల బకాయిలే 1,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa