ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదలకు ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 11:59 AM

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురిసిన వర్షాలకు జిల్లాలోని గిరి నది పొంగిపొర్లుతోంది. దీని ధాటికి సమీపంలోని మలాగి దడియత్‌ గ్రామంలోని నివాస ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. అయితే వారిని శిథిలాల కింద గుర్తించామని, అప్పటికే వారంతా మరణించారని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa