2024 తరువాత మరో చంద్రబాబును చూస్తారు. ఆయనపై హత్యాయత్నం పోలీసు వ్యవస్థకే అవమానం’’ అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పటిదాకా శాంతికాముకుడుగా చంద్రబాబును చూశారు. 2024 తరువాత మరో రూపంలో ఆయనను చూస్తారు. తనను, తన కుటుంబాన్ని అవమానించిన పిచ్చికుక్కలను చంద్రబాబు వదలబోడు. జగన్రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు తింటున్నవారంతా చంద్రబాబు పాలనలో నోరు ఎత్తలేదేం? రాజేంద్రనాథరెడ్డి వంటి అధికారులను తల్లిని, చెల్లినే వదిలేసిన జగన్రెడ్డి కాపాడతాడా? చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి పోలీసు యూనిఫారం వేసుకున్న వైసీపీ నేత. అతని మాటలు, వ్రవర్తన పోలీసు వ్యవస్థకే కళంకం. జగన్రెడ్డి దుర్మార్గాలు, దాష్టీకాలు, హత్యా రాజకీయాలతో ఏపీ ఎప్పుడో బిహార్ను మించి పోయింది. జగన్రెడ్డి పాలన వచ్చిన తరువాత రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరిగే దారుణాలు ఒక ఎత్తయితే పల్నాడులో జరిగేవి మరో ఎత్తు. వందమందికి పైగా టీడీపీ నాయకులను, కార్యకర్తలను హతమారిస్తే పల్నాడులోనే 20 మందికిపైగా హతమయ్యారు. టీడీపీ హయాంలో సమర్థంగా పనిచేసిన రాజేంద్రనాథ్రెడ్డి ఇప్పుడు తన విధి నిర్వహణను జగన్రెడ్డి కాళ్ల వద్ద పెట్టడం పోలీసు వ్యవస్థకే తలవంపులు. పోలీసు వ్యవస్థను మేం తప్పు పట్టడం లేదు. ఖాకీ దుస్తులు వేసుకుని కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తల్లా రెచ్చిపోతున్న పోలీసుల జాబితా మా వద్ద ఉంది. జగన్రెడ్డి అండతో రెచ్చిపోయిన ప్రతి పోలీసుకూ చెప్పాల్సిన పద్ధతిలో బుద్ది చెబుతాం’’ అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa