సిద్ధాంతం, విలువలు, అజెండా లేకుండా జనసేన పార్టీ ఎలా ఉందో.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కూడా అంతేమాదిరిగా ఉందని, ఏ అజెండాతో పర్యటనలు చేస్తున్నాడో.. ఎవరిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాడో ప్రజలకు అర్థంకావడం లేదని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు చెప్పింది చేయడం.. ఎల్లోమీడియా ఇచ్చిన స్క్రిప్టును చదవడం.. చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పడం.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై లేనిపోని నిందలు వేయడమే పవన్కళ్యాణ్ అమలు చేస్తున్న ఫార్ములా అని వివరించారు. పవన్కళ్యాణ్ జనసేనాని కాదు.. జన వినాశకుడు అని అందరికీ బోధపడిందన్నారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విలేకరుల సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa