ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్ ను కలిసిన కొత్త ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 09:10 PM

గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా డాక్టర్ కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ నియమితులైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.వెలగపూడిలోని ఏపీ శాసనమండలిలో చైర్మన్ మోషేన్ రాజు తన చాంబర్ లో పద్మశ్రీ, కుంభా రవిబాబులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. వారిద్దరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa