తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించగా.. ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి. చిరుత ట్రాప్ బోన్కు సమీపంలోనికి వచ్చి వెనక్కి వెళ్లిపోయింది.. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చి ట్రాప్ చేసేందుకు సిబ్బంది యత్నించగా తప్పించుకుని పారిపోయింది. చిరుత, ఎలుగుబంటిని ట్రాప్ చేస్తే నడక మార్గంలో వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పినట్లేనని భావిస్తున్నారు అటవీశాఖ అధికారులు.
తిరుమల నడకదారిలో చిరుతలను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామరు పీసీఎఫ్ నాగేశ్వరరావు. వన్య మృగాల కదలికలపై 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని.. మోకాళ్ల మెట్టు, నరసింహ స్వామి ఆలయం దగ్గర నిఘా పెంచామన్నారు. చిరుత, ఎలుగుబంటి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయని.. నడక మార్గంలో వందమంది ఓ గ్రూప్గా వెళ్లాలని సూచించారు. నడక మార్గంలో గణనీయంగా భక్తులు సంఖ్య తగ్గిందన్నారు. ఇటీవల పట్టుకున్న రెండు చిరుతల్లో లక్షితను ఏ చిరుత చంపేసిందనేనది రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. మొత్తం 80 చోట్ల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఫారెస్ట్ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక చిరుత, ఎలుగుబంటి మాత్రమే ఉన్నాయని.. వైల్డ్ లైఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం కంచె ఏర్పాటుపై నిర్ణయం ఉంటుంది అన్నారు. మహారాష్ట్ర నుంచి కొన్ని బోనులు తీసుకు వచ్చామని.. వాటిని కొన్ని రీమోడల్ చేస్తున్నామన్నారు. తమకు టీటీడీ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు జంతువులు సంపర్కం సమయం వల్ల ఎక్కువగా చిరుతల కదలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కంఫా ఫండ్స్తో అటవీ సమీప ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నాగేశ్వరరావు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa