డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గూడాల గ్రామానికి చెందిన జోత్స్న దుర్గను మారే శాంతిస్వరూప్కు ఇచ్చి 2020లో వివాహం జరిపించారు. వీరి కాపురం కొన్ని రోజుల పాటు సజావుగానే సాగింది. అనంతరం అదనపు కట్నం కోసం దుర్గను హింసించడం ప్రారంభించాడు. భార్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని 2022 ఆగస్టు 1న శాంతిస్వరూప్ తన మోటారు సైకిల్లోని పెట్రోలు తీసి దుర్గపై పోసి చంపేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచీ పరారీలో ఉన్న శాంతి స్వరూప్పై పోలీసులు నిఘా పెంచారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు నేతృత్వంలో అల్లవరం ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ బృందం ఈ కేసులో నిందితుడి గురించి దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని బాచుపల్లి ప్రాంతంలో కేఆర్సీఆర్ హరితవనం వద్ద ఉన్నాడన్న సమాచారంతో ఎస్ఐ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని అల్లవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.శుక్రవారం నిందితుడు శాంతిస్వరూప్ను అమలాపురం కోర్టులో హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించారు. నిందితుడిని అరెస్టులో కీలకపాత్ర పోషించిన సీఐ వీరబాబు,ఎస్ఐ, సిబ్బందిని కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa