దళితులను సీఎం జగన్ నమ్మించి దగా చేశాడని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలపై దాడులు, హత్యలు పెరిగాయని, ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల పాదయాత్రలో దళితులకు మోసపూరిత హామీలు ఇచ్చి స్వార్ధ ప్రయోజనాల కోసం వారిని వాడుకున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమం మాటున రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారన్నారు. దళితులపై దాడిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. దళితుల కోసం టీడీపీ ప్రవేశపెట్టిన భూమి కొనుగోలు పథకం, కులాంతర వివాహాల ప్రోత్సాహం తదితర 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేశారని, అంబేడ్కర్ విదేశి విద్యను జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చరని విమర్శించారు. సమావేశంలో ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి జల్లి కృపారావు, పెనుముచ్చి సురేష్, తలారి మూర్తి, ముచ్చి సురేష్, శీలం రవి, రొంపిచర్ల ఆంటోనిదాస్, గాలి వెంకటేశ్వరరావు, బత్తిన రత్నరాజు, కాయల సత్యనారాయణ, అంబటి శ్రీను పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa