రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 31 నుంచి ఛత్తీస్గఢ్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆమె రాయ్పూర్ మరియు బిలాస్పూర్లలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి కార్యాలయం ఆమె మినిట్ టు మినిట్ షెడ్యూల్ను విడుదల చేసింది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఆగస్టు 31న ఉదయం 11.05 గంటలకు రాయ్పూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాయ్పూర్లోని ప్రజాపితా బ్రహ్మకుమారి ఈశ్వరీయ ట్రస్ట్ శాంతి సరోవర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె మహంత్ ఘాసిదాస్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. సెప్టెంబర్ 1న, ఆమె రతన్పూర్ (బిలాస్పూర్)లోని మహామాయ ఆలయాన్ని సందర్శించి, గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్శిటీ 10వ స్నాతకోత్సవ వేడుకలకు హాజరవుతారు. యూనివర్సిటీ 28 మంది రీసెర్చ్ స్కాలర్లకు పీహెచ్డీ డిగ్రీలు, 76 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు అధికారిక సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa