ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తర్వాత తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నేత.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కాగా.. ఈ కేసులో మాగుంట కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్గా మారిపోగా.. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్గా మారిపోయారు. శుక్రవారం సాయంత్రం అప్రూవర్గా మారిన ఎంపీ.. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులకు అందించినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది.
అయితే.. ఈ కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన సౌత్ గ్రూప్లో మాగుంట తండ్రీ కొడుకులు కీలకంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఎంపీ మాగుంట, ఆయన కొడుకు రాఘవ ఇద్దరూ అప్రూవర్లుగా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన ఈడీ అధికారులు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై పూర్తి ఫోకస్ పెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఈడీ అధికారులు పూర్తి ఫోకస్ పెట్టగా.. ఇప్పుడు ఎంపీ మాగుంటి అప్రూవర్గా మారటం మాత్రం ఊహించని పరిణామామేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో చాలా మంది సౌత్ గ్రూప్నకు చెందిన వారే కావడం ఆలోచించదగిన విషయం. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంటదే కావటణ గమనార్హం. అయితే.. అప్రూవర్గా మారిన మాగంటి ఈడీకి ఏమేం సమాచారం ఇచ్చారు..? ఎవరెవరి గురించి బయటపెట్టారు..? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa