పోలీస్ స్టేషన్కు వచ్చే పేదలు మరియు సామాన్య ప్రజలు భావించే విధంగా ప్రజలకు అనుకూలమైన పోలీసు వ్యవస్థను రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అన్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జరిగిన సీనియర్ పోలీసు అధికారుల వార్షిక సదస్సులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రసంగిస్తూ..సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ను పటిష్టం చేసేందుకు 230 మంది కొత్త సిబ్బందికి ఆమోదం తెలిపామని, అవసరమైతే సిబ్బందికి కొత్త భవనాలు ఏర్పాటు చేస్తామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.అనైతిక పోలీసింగ్పై ప్రభుత్వం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.పోలీస్ స్టేషన్కు వచ్చే పేదలు, సామాన్యులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందించాలన్నారు.ఈ సమావేశంలో హోంమంత్రి జి పరమేశ్వర్, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రజనీష్ గోయెల్, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్, నగర పోలీస్ కమిషనర్ దయానంద్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి గోవిందరాజులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa