ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కెనడా మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం,,,ఐరాస వేదికగా కెనడాపై జై శంకర్ పరోక్ష వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 08:38 PM

ప్రస్తుతం భారత్ కెనడాల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సాక్షాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేయడం రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి వేదికగా కెనడాకు పరోక్షంగా భారత్ గట్టి హెచ్చరికలు పంపించింది. రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస వంటి వాటికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై ఉండకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. అంతర్జాతీయ నిబంధనలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవవించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన జై శంకర్.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వివిధ దేశాలకు పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. కొన్ని దేశాలు ప్రపంచ ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయని.. అయితే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ నియమాలను పాటిస్తుందని స్పష్టం చేశారు. అందరూ అనుకుంటే న్యాయమైన, సమానమైన, ప్రజాస్వామ్య క్రమం తప్పకుండా వస్తుందని జై శంకర్ హితవు పలికారు. భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జై శంకర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగానే బ్రిక్స్ సదస్సు, జీ 20 సమావేశాలు, చంద్రయాన్ 3 విజయం సహా వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa