ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు ప్రతిపక్ష టీడీపీపై అక్రమ కేసులు పెట్టి, భయపెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటేవైసీపీ పొరబడినట్లేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విమర్శించారు. చంద్రబాబును అరెస్టుతోపాటు లోకేష్ను అసలు నిర్మించని ఐఆర్ఆర్ కేసులో ఏ14గా చేర్చడం దారుణమన్నారు. నాలుగున్నరేళ్లలో జగన్ రాష్ట్రానికి ఏమిచేశారో చెప్పాలన్నారు. ఇసుక, మద్యం మాఫియాలతో తాడేపల్లి ప్యాలెస్లో చక్రం తిప్పుతున్నారన్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా కేవలం కేసులు పెట్టడం, దాడులు చేయడమే పాలనగా జగన్ భావిస్తున్నారన్నారు. బాబు కోసం ప్రతి ఒక్కరూ బయటకు వస్తున్నారన్నారు. టీడీపీకి ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. బాబు బయటకు వస్తే ఓటమి తప్పదనే ఇలా చేస్తున్నారని, ఈ సంస్కృతి మంచిది కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa