ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీయడంతో శుక్రవారం కోస్తాలో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా కావలిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కావలిలో 2018 అక్టోబరు 12న 38.6 డిగ్రీలు నమోదైంది. అక్టోబరు నెలకు సంబంధించి అదే అత్యధికం కాగా.. దానిని దాటి శుక్రవారం 40.1 డిగ్రీలు నమోదైంది. నెల్లూరులో 38.7, ఒంగోలులో 38.9డిగ్రీలు నమోదయ్యాయి. వాయువ్య గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగి వేడి వాతావరణం ఉందంటున్నారు.
మరోవైపు విచిత్రంగా మరికొన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి.శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని.. మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేస్తోంది ఏపీ విపత్తుల సంస్థ. అక్టోబర్ నెలలో సాధారణంగా వర్షాలు పడుతంటాయి.. అందుకు భిన్నంగా ఎండలు మండిపోతున్నాయి. అది కూడా ఎండాకాలాన్ని తలపించే వాతావరణం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటూ ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మొత్తం మీద ఏపీలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa