ఏపీ మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రోజా ఎమోషనల్ అయ్యారు.. మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. బండారుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. కోర్టులో బెయిల్ వచ్చింది. అయితే సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ స్పందించారు. బండారు సత్యనారాయణ మూర్తిపై ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యాడని.. వెంటనే రోజాకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాని మోదీ తీసుకొచ్చారని.. ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్లు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.
మహిళలని గౌరవించే వాళ్లు ఎవరూ ఇలా మాట్లాడరని.. మహిళలను దూషించడం బండారుకి జన్మ హక్కు అనుకుంటున్నారా అని ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ మూర్తి రాష్ట్ర, తన నియోజకవర్గ మహిళలను అవమానించినట్లే అన్నారు. దేశంలో మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో మహిళ పై ఇంత అసభ్యకరంగా మాట్లాడతారా..? బండారు క్షమాపణ చెప్పేంత వరకు రోజాతో కలిసి పోరాటం చేస్తాను అన్నారు. బండారు వంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా గెలిపించడం ప్రజల దురదృష్టమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa