ఈ నెల 25 నుంచి డిసెంబరు 31 దాకా ఎమ్మెల్యేల నేతృత్వంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. సామాజిక న్యాయయాత్ర పేరిట నిర్వహించే ఈ బస్సుయాత్రకు ఎమ్మెల్యే నాయత్వం వహిస్తారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 10దాకా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ ఉంటుంది. నవంబరు 20 నుంచి 30 దాకా వైఎ్సఆర్ ఆసరా అమలు చేస్తాం. డిసెంబరు 11 నుంచి జనవరి 15 దాకా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 2024 జనవరి ఒకటో తేదీన పింఛను రూ.3,000కు పెంచుదాం. జనవరి 10 నుంచి 20 దాకా జగనన్న చేయూత అందిస్తాం’ అని వెల్లడించారు. ప్రతి ఇంటికీ అందుతున్న లబ్ధితో.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులనూ వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంక్షేమ పథకాలు అందుతున్నందున 175కు 175 స్థానాలనూ గెలుచుకుంటామన్న ధీమా ప్రదర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa