పల్నాడు జిల్లా కారంపూడిలో విషాదం చోటు చేసుకుంది. రామాంజిని అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కుటుంబసభ్యులు కారంపూడి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రసవానికి వైద్యులు ఏర్పాటు చేస్తుండగా.. భర్త ఆనంద్ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానంటూ కారంపూడికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. రామాంజిని పాపను ప్రసవించే సమయానికి నరసరావుపేట ఆసుపత్రికి భర్త మృతదేహం వచ్చి చేరింది. దీంతో ఆ మహిళకు పాప పుట్టిందన్న సంతోషం ఎక్కవ సేపు నిలవలేదు. భర్త మరణవార్త తెలిసి రామాంజిని కన్నీరుమున్నీరుగా విలపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa