ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 2న విశాఖ కు సీఎం జ‌గ‌న్‌ రాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 12:41 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వచ్చే నెల రెండో తేదీన విశాఖ నగరానికి రానున్నారు. జల వనరుల నిర్వహణపై రుషికొండలోని రాడిసిన్‌ బ్లూ హోటల్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సును కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండో తేదీ ఉదయం విజయవాడ నుంచి వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళతారని జిల్లా అధికారులు శుక్ర‌వారం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa