ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సింహాచలం అప్పన్న దేవాలయం మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2023, 02:19 PM

ఈరోజు (శనివారం) విశాఖపట్నం, సింహాచలం అప్పన్న దేవాలయాన్ని  చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు మూసివేయనున్నారు. ఉదయం 6:30గంటల నుంచి మధ్యహ్నం 2:30 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. మధ్యహ్నం 2:30 గంటల తర్వాత దర్శనాన్ని నిలిపివేసి స్వామివారి తలుపులు కవాట బంధనం చేయనున్నారు. తిరిగి 29న ఆదివారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం చేసి ఉదయం 8:00 గంటల నుండి స్వామివారి దర్శనం పున:ప్రారంభంకానుంది. 29న ఉదయం స్వామివారికి సుప్రభాతం, ఆరాధనం, స్వర్ణపుష్పార్చనం, గరుడ సేవలు నిలుపదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa