విశాఖలో ఆటో ఎక్కుతున్నారా.. ఆదమరిస్తే మీ జేబులు, బ్యాగ్లు మొత్తం ఖాళీ అవుతాయి జాగ్రత్త. ఆటో ఎక్కి ప్రయాణికుల ముసుగులో ఓ గ్యాంగ్ చోరీలు చేస్తోంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన పెందుర్తి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం దరి దుర్గానగర్కు చెందిన సత్యవతి గురువారం రాత్రి ఆటోలో నగరానికి బయలుదేరారు. వేపగుంట కూడలిలో ఇద్దరు గుర్తు తెలియని మహిళలు ఆటో ఎక్కి నాయుడుతోట కూడలి దగ్గర దిగిపోయారు. అనంతరం సత్యవతి తన హ్యాండ్ బ్యాగ్ చోరీ అయ్యింది.. ఆ విషయాన్ని ఆమె గమనించారు. బ్యాగులో సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని మహిళలు దోపిడీ చేసినట్లు తెలుసుకుని పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు.. దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆటోల్లో ప్రయాణికుల్లా నటించి చోరీలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa