తిరుమలలో పార్వేట మండపం, అలిపిరి పాదాల మండపం దగ్గర విశ్రాంతి మండపాల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. భానుప్రకాష్ రెడ్డి వస్తే మీడియా సమక్షంలో మండపాలను పరిశీలించొచ్చని చెప్పారు. అయితే టీటీడీ ఈవో వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. ప్రాచీన కట్టడాలను, పురాతన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు చాలానే ఉన్నాయని.. ప్రాచీన కాలంలో ఎంతో మంది రాజులు తిరుమల కొండపై అనే కట్టడాలు నిర్మించారన్నారు.
విజయనగరం రాజుల హయాంలో నిర్మించిన మండపమే పార్వేట మండపమని.. దాదాపు 500 ఏళ్ల నాటి అతి పురాతన కట్టడమని చెప్పుకొచ్చారు. ఆ మండపాన్ని జీర్ణోద్ధరణ పేరుతో తొలగించారని.. ఎవరి అనుమతితో తొలగించారని ప్రశ్నించారు. ఒకవేళ పాలకమండలిలో నిర్ణయం తీసుకుని ఉంటే ఏ తేదీలో నిర్ణయం తీసుకొన్నారో టీటీడీ ఈవో సమాధానం చెప్పాలన్నారు. సెక్షన్ 30 ఆఫ్ ప్రిన్సిపాల్ యాక్ట్ ప్రకారం ప్రాచీన కట్టడాలు తొలగిస్తే మూడేళ్ల శిక్ష పడుతుందన్నారు.
ఆర్కియాలజీ వారు గతంలో 2011లో వెయ్యి కాళ్ల మండపం తొలగింపుపై నోటీసులు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ఆర్కియాలజీశాఖ వారి అనుమతి లేకుండా ఎలాంటి పురాతన కట్టడాలను తొలగించరాదన్నారు. టీటీడీ 1958 సెక్షన్ 6 /253 క్రింద ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెబుతోందని.. కానీ ఆ సెక్షన్ సారాంశం ప్రకారం అది 100 ఏళ్లలోపు ఉన్న కట్టడానికి మాత్రమే వర్తిస్తుంది అన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాను తిరుమలలోని పార్వేట మండపం దగ్గరకు వస్తానని సవాలక చేశారు. తన దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకుని వస్తానని.. టీటీడీ వారు కూడా రావాలన్నారు. టీటీడీ ఈవో స్థానంలో ఉండి సవాళ్లు విసరడం.. మాయని మచ్చ అన్నారు. ఇప్పటికే టీటీడీ ఈవోకు లీగల్ నోటీసు పంపామని.. సరైన వివరణ ఇవ్వకపోతే కోర్టులో కేసు నమోదు చేస్తామన్నారు. తమ పోరాటం హిందుత్వాన్ని కాపాడడం కోసం.. టీటీడీపై మాత్రం కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa