వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.... మేము రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి చూసింది పెద్దనాయకులే సభల్లో మాట్లాడేవారు. కానీ జగనన్న పరిస్థితి మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైనా, పేదలైనా సభల్లో మాట్లాడటం కనిపిస్తోంది. ఆ స్థాయి, సాధికారత కల్పించింది జగనన్నే. భారతదేశ చరిత్రలోనే జగనన్నలాంటి నాయకుడిని ఎవరూ చూడలేదు. ఆయన మన పిల్లల గురించి, వాళ్ల చదువుల గురించి ఆలోచిస్తాడు. పేదలైనవారు పెద్ద చదువులు చదవాలని, వారి కుటుంబాల తలరాతలు మారాలని తపించే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరే. మన రాష్ట్రంలోనే కాదు, పక్కరాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చేస్తున్న ఘనత జగనన్నది. శాసనసభ మొదలు పార్లమెంటు దాకా, శాసనమండలి మొదలు రాజ్యసభ వరకు, 56 కార్పొరేషన్లలో ఛైర్మన్ల వరకు ఈరోజు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారంటే జగనన్న వల్లనే అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa