లామినేషన్ పేపర్ కొరత కారణంగా పౌరులకు పాస్పోర్ట్ల జారీని పాకిస్థాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో విదేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వేలాది మంది పౌరులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాస్పోర్ట్ల తయారీ వినియోగించే లామినేషన్ పేపర్లు ఫ్రాన్స్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, భారీగా బకాయిలు పేరుపోవడంతో ఫ్రాన్స్ ఎగుమతులను ఆపేసింది. పేపర్ల కొరతతో పాస్పోర్ట్లను నిలిపివేసినట్టు పాకిస్థాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్స్ ప్రకటనను ఉటంకిస్తూ అక్కడ మీడియా కథనాలు ప్రచురించింది. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో విదేశీ మారకపు నిల్వలు దారుణంగా పడిపోయాయి. దీంతో విదేశీలకు రుణాలు చెల్లించలేక సతమతమవుతోంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్కు భారీగా బకాయి పడింది.
ఈ పరిస్థితిపై పాక్లోని గుజరాత్కు చెందిన జైన్ ఇజాన్ అనే యువకుడు మాట్లాడుతూ.. యూకేలో చదువుకోవాలనేది తన చిరకాల కల అని అన్నాడు. దీనిని సాకారం చేసుకునే క్రమంలో యూకే వర్సిటీలో సీటు సాధించాను.. అయితే, పాస్పోర్ట్ పొందడంలో అసాధారణ జాప్యం ఇప్పుడు నా ఆకాంక్షలను కూల్చివేసే ప్రమాదం ఉందని వాపోయాడు. ఇజాన్ మాదిరిగానే ఉపాధి, విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పాక్లోని వేలాది మంది యువకులు పాస్పోర్ట్ల కోసం పడిగాపులు కాస్తున్నారని అక్కడ మీడియా తెలిపింది. ‘నేను త్వరలో ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం, నేను మా అదృష్టం ఎట్టకేలకు మారుతుందని ఆనందించాం.. అయితే ఇమ్మిగ్రేషన్ తప్పుడు నిర్వహణతో పేదరికం, ఈ దేశం నుంచి బయటపడే బంగారం లాంటి అవకాశం కోల్పోయాను’ అని పంజాబ్లోని మారుమూల ప్రాంతానికి చెందిన గుల్ అనే యువకుడు విలపించారు.
పెషావర్కు చెందిన హీరా అనే విద్యార్థి కూడా గుల్ లాంటి కష్టమే ఎదురైంది. ‘ఇటలీకి నా విద్యార్థి వీసా ఇటీవల వచ్చింది.. నేను అక్టోబర్లో ఆ దేశంలో ఉండాలి.. కానీ, పాస్పోర్ట్ అందుబాటులో లేకపోవడం అవకాశం చేజారింది ’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రభుత్వం అసమర్థతకు మేము మూల్యం చెల్లించుకోవడం అన్యాయమని వాపోయింది. అయితే, లామినేషణ్ పేపర్ కొరతతో పాక్లో పాస్పోర్ట్ జారీని నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2013లోనూ ఇటువంటి పరిణామం చోటుచేసుకుంది. గతంలో రోజుకు 3 నుంచి 4 వేల వరకూ పాస్పోర్టులను జారీచేసేవాళ్లమని, ప్రస్తుతం 12 నుంచి 13 కూడా జారీచేయడంం లేదని పెషావర్ పాస్పోర్ట్ కార్యాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందో తనకు తెలియదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ అధికారి అన్నారు. పౌరు మరో రెండు నుంచి మూడు నెలల పాటు వేచి చూడక తప్పదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa