ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి ధర్మర రథం చోరీ కేసు,,,,నిందితుడికి శిక్ష విధించిన తిరుపతి కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 10:09 PM

తిరుమలలో శ్రీవారి ధర్మ రథం ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ మండలం అంజనాపుర్‌ గ్రామానికి చెందిన నీలావర్‌ విష్ణుకి మూడు నెలలు జైలుశిక్ష విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి పల్లపోలు కోటేశ్వరరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబరు 24న ఎలక్ట్రిక్‌ బస్సుని తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో ఛార్జింగ్‌లో పెట్టి ఉండగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.


తిరుమలలో సెప్టెంబర్‌ నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈ చోరీ ఘటన జరిగింది. భక్తుల కోసం కొండపై ఏర్పాటు చేసిన ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును విష్ణు ఎత్తుకెళ్లాడు. తిరుమలలో ఉన్న బస్టాండ్‌లో ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో తీసుకెళ్లాడు. ఈ బస్సుల్లో జీపీఎస్ లొకేషన్ ఉంది.. దీని ఆధారంగా ఆ బస్సును నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లి పారిపోయినట్లు గుర్తించారు.


విష్ణు ఆ రోజు తెల్లవారుజామున 3:53 గంటలకు జీఎన్‌పీ వద్ద ఘాట్ రోడ్డులోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. వెంటనే తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు నాయుడుపేట నుంచి చెన్నై మీదుగా తీసుకెళ్లగా.. గస్తీలో ఉన్న పోలీసులను గమనించి బస్సును రోడ్డుపై వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. అతడ్ని కొద్దిరోజులకే తిరుపతి బస్టాండ్ సమీపంలో నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.


ఈ కేసులో నిందితుడు విష్ణుది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అనంజపూర్‌గా గుర్తించారు. అతడి కుటుంబం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటున్నారు. అతడి తండ్రి ‌నీలావర్‌ గణపతి 2015లో భార్యను హత్యచేసి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత విష్ణుతో పాటూ అతడి అక్కను ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రంలో చేరారు. విష్ణు పదో తరగతి పూర్తిచేసి కొద్ది రోజుల పాటూ చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత విష్ణు చోరీలు మొదలుపెట్టాడు.


అతడు మొదట సైకిల్‌ చోరీ చేసి పరారయ్యాడు.. అప్పటి నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. అతడు తిరుపతికి మకాం మార్చి.. తిరుమలలో మంచిగా ఉంటున్నట్లు నటించి అందరితో పరిచయం పెంచుకున్నాడు.. ఆ తర్వాత అతడు ఓ అధికారి ఎలక్ట్రికల్ కారును దొంగతనం చేశాడు. అయితే పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు అతడ్ని మందలించి పంపించేశారు.. ఇప్పుడు ఏకంగా బస్సును ఎత్తుకెళ్లాలని చూశాడు.. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa