ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసి కక్షాపూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే.. ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణం అన్నారు. శుక్రవారం (నవంబర్ 17) నెల్లూరులో మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందని, వైఎస్ జగన్ ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ లేదని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, మరోవైపు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను కూడా నిర్లక్ష్యం చేస్తోందని పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని.. ప్రశ్నించడం విపక్షాల హక్కు అని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీ చేయడానికి అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడి మ్యానిఫెస్టో పైనా కసరత్తు చేస్తున్నాయి. ఇరు పార్టీల నుంచి ప్రతినిధుల బృందం ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి. కేంద్రంలో బీజేపీతో కలిసే వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతుండగా.. టీడీపీతో కలిసి పోటీ చేసే విషయంపై బీజేపీ ఇప్పటికీ ఎటూ తేల్చలేదు. ఈ నేపథ్యంలో జనసేన - టీడీపీ, బీజేపీ కూటమి విషయంలో ఏపీలో గందరగోళం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa