వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ........ సామాజిక సాధికారిత అనే మాట చెప్పడానికి జగన్ కు తప్ప దేశంలో మరే నేతకు అర్హత లేదన్నారు. అణగారిన వర్గాలకు ఆలోచన చేసే శక్తి లేదన్నది చంద్రబాబు భావన అని మండిపడ్డారు. మోసానికి ఒక రూపం , అబద్ధానికి ఒక రూపం చంద్రబాబు అని విమర్శించారు. అనుభవం కలిగిన నేతనంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తాడని, బీసీల అప్పుల తీర్చేస్తానని, ఇంటికో ఉద్యోగం, మహిళలకు డ్వాక్రా రుణాలు కట్టేస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన నాయకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. నిజం అంటే జగన్, అబద్ధం అంటే చంద్రబాబు అని నినదించారు. మత్స్యకారులకు కష్టం వస్తే గంటలో చెక్కులు పంపిణీ చేయించిన నేత జగన్ నిజమైన నేత అయితే, మోసాలతో కాలం వెళ్లబుచ్చే అబద్దం చంద్రబాబు అన్నారు. అబద్దం 14 ఏళ్లు ప్రజల్ని పట్టి పీడిస్తే, నిజం రూపంలో కలలను సాకారం చేస్తున్న జగన్ మనకు ముద్దు అని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలించడానకిి వచ్చిన అవతార రూపమే జగన్ అని అభివర్ణించారు. అమ్మఒడి అనే ఔషధం వేసి బాల కార్మిక వ్యవస్థను రూపు మాపిన స్పూర్తిదాయక నేత జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa