చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ , ఆధార్ కార్డు కూడా లేదని, హైదరాబాద్ లో ఆయన ఉన్నందున ఆయనకు వినపడేలా జగన్ రావాలి.. జగనే కాావాలి... మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా, తన కాళ్లపై తాను నిలబడటమే సామాజిక సాదికారతని వివరించారు. రాష్ట్రాన్ని అత్యధికంగా పాలన చేసిన చంద్రబాబు మాట్లాడితే తమది బీసీల పార్టీ అని పదే పదే చెబుతుంటాడని, కానీ స్పీకర్ గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ ను జగన్ ఎంపిక చేస్తే పోడియం వద్దకు కూడా వెళ్లకుండా చంద్రబాబు అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసారు. బీసీలను అవమానించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనడమే కాకుండా గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అప్పట్లో చంద్రబాబు అవమానపరిచారని, అలాంటి చంద్రబాబు ఎక్కడా... ఎస్సీ, ఎస్టీ, ,మైనారిటీ,బీసీలను నెత్తిన పెట్టుకున్న జగన్ ఎక్కడా... అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. బాబు హయాంలో ఏ పేదవాడికైనా మేలు జరిగిందా, ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాడా అని ప్రశ్నించారు. కానీ జగన్ హయాంలో అర్హులైన పేదలందరికీ ఇంటికే సంక్షేమ పథకాల లబ్ధి సమకూరుతోందని వివరించారు. జన్మభూమి కమిటీలతో ప్రజలపై బాబు స్వారీ చేయిస్తే, జగన్ సచివాలాయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే నేరుగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు. డిసెంబర్ మొదటి వారంలో సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేయబోతున్నారని, అప్పటి నుంచి విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ప్రకటించారు. కార్యాలాయాల కోసం ప్రభుత్వ భవనాలు కేటాయిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని టీడీపీ నాయకులు ఇంకా ఎంతకాలం చంద్రబాబుకు బానిసలుగా ఉంటారు.. రండి.. బయటకు రండి వస్తే విశాఖను పరిపాలనా రాజధాని చేసుకుందాం.. అని సీదిరి అప్పలరాజు ఆహ్వానం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa