ముంచుకొస్తోన్న తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని టీడీపీ యువనేత లోకేష్ అన్నారు. తుఫాన్ బాధితులకు పార్టీ క్యాడర్.. నేతలకు ఆసరాగా నిలవాలని ఆదేశించారు. మిచాంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలలో ఉండాలని... ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లు చార్జింగ్ ఉంచుకోవాలని చెప్పారు. శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దని లోకేష్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa