వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే ఆదర్శాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక సాధికారత అందించిన జగనన్న. మహానుభావులు ఉద్యమాలు చేసి, సాధించాలనుకున్న సామాజిక న్యాయాన్ని ఆచరణలోకి తెచ్చిన జగనన్న. అణగారిన వర్గాలకు అన్నీ తానై భరోసాగా నిలిచిన సీఎం జగన్. కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు, అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారు. జగనన్న వల్లే సాధ్యమయ్యే పాలన ఇది. మన పిల్లలు సంతోషంగా బడులకు వెళ్తూ మంచి చదువులు చదువుతున్నారు. మనం ఈరోజు ధైర్యంగా నిలబడి, ముందుకు సాగుతున్నమంటే అందుకు జగనన్నే కారణం. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చులకనగా చూసి, అవమానించిన చంద్రబాబు. ఆయా వర్గాలను అక్కున చేర్చుకుని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేర్చాలని జగనన్న తపిస్తున్నారు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa