వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ... వైయస్ జగన్మోహన్రెడ్డి అంటే ఒక సామాజిక విప్లవం. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయనలాంటి నాయకుడు మరొకరు లేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చట్టసభల్లో అగ్రపీఠం వేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేశాడో మనకు తెలుసు. ఓటుకు నోటు కేసు మనకు తెలుసు. వ్యవసాయం దండగ అన్న పెద్ద మనిషి చంద్రబాబు. ఆయన చేతిలో మోసపోని వర్గమంటూ ఒక్కటీ లేదు. ఆయన మాయమాటలతో మళ్లీ మనల్ని మోసం చేయడానికి బయలు దేరుతున్నాడు. ఆయన గతాన్ని ఓసారి గుర్తు చేసుకుని, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa