పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దేవళంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు అనంత కుమారాచార్యులు స్వామి దేవేరులకు పంచామృత అభిషేకాలను నిర్వహించి పలు రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఉభయ దారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa