వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి జగనన్న ప్రజల కష్టాలు చూశారు. నష్టాలు చూశారు. బాధలు చూశారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగానే...ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అవి నేరుగా ప్రజలకు చేరేలా చేశారు. ప్రజల కష్టాలు తీర్చడం. బాధలు తీర్చడం, రైతులను నష్టాల నుంచి కాపాడుకోవడమే లక్ష్యంగా జగనన్న పనిచేస్తున్నారు. జగనన్న ఓదార్పు యాత్ర చూశాం. పాదయాత్ర చూశాం. ప్రజల కోసం ఎందాకైనా అనే నాయకుడు జగనన్న. ఆయన ఈ నాలుగున్నరేళ్లలో పేదలకు, మహిళలకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. మహిళల ఆర్థిక సాధికారతకోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa