వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ..... బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు మొత్తం ఒకతాటిపైకి వచ్చారు. జగనన్న పక్షాన రాష్ట్రంలో మోత మోగిస్తున్నారు. 28 రాష్ట్రాల్లో సీఎంలు ఉంటే ఏ ఒక్కరూ సామాజిక న్యాయాన్ని పాటించలేదు. సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్నమాత్రమే. జగనన్న కటౌట్ పెడితేనే ఇన్ని వేల మంది వచ్చారు. జగనన్న బయటకొస్తే సునామీనే. కేబినెట్లో 25 మంది ఉంటే 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. ఏనాడైనా ఫలానా సామాజిక వర్గానికి న్యాయం చేశానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?* వర్ల రామయ్యకు రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి ప్రకాశం బ్యారేజీ దాటకముందే కనకమేడలకు అమ్ముకున్న చంద్రబాబు. రాజ్యసభ పదవులు అమ్ముకొనే పరిస్థితులు పోయి మోపిదేవి, పిల్లి సుభాష్, బీద మస్తాన్రావు, ఆర్.కృష్ణయ్య లాంటి బలహీన వర్గాలకు ఇచ్చిన జగనన్న. ఒకప్పుడు వార్డు మెంబర్ కావాలంటే అడుక్కోవాల్సిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బడుగులను రాజ్యసభ సీట్లో కూర్చోబెడుతున్న చరిత్ర. 50 శాతం నామినేటెడ్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏకంగా చట్టం చేసి మనకు చుట్టంగా ఇచ్చిన జగనన్న. టీడీపీ మేనిఫెస్టో గురించి, మా మేనిఫెస్టో గురించి చర్చకు రెడీ. చంద్రబాబుగానీ, అచ్చెన్నాయుడుగానీ సిద్ధమా? రైతుల్ని రుణమాఫీ పేరుతో, డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్కచెల్లెమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు, పవన్. నిరుద్యోగభృతి ఇస్తానని, ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిన చరిత్ర వారిది. ముందు వాటికి సమాధానం చెప్పాలి. చంద్రబాబుకే గ్యారెంటీ లేదు. మనకెక్కడ గ్యారెంటీ ఇస్తాడు? దొంగలకు చంద్రబాబుకు తేడా లేదు. వీళ్లను తరిమి కొట్టాలని కోరుతున్నాం అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa