విశాఖపట్నం రాజధానిపేరుతో ఉత్తరాంధ్ర ప్రజలని సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. దోచుకోవడం దాచుకోవడమే వైసీపీ పాలసీ అని పేర్కొన్నారు. మద్యపానం నిషేధంపై మాట తప్పారన్నారు. మద్యంపై అప్పులు తెచ్చుకున్న అప్పుల మహారాజు జగన్ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలపై ధరల భారం మోపాడన్నారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. అంగన్వాడీ వర్కర్లు హామీలు నెరవేర్చలేదన్నారు. అడుదాం ఆంధ్రా అంటూ డబ్బులు దండుకుంటున్నాడని.. ప్రజలు మేల్కోవాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa