వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ... వెనుకబడిన కులాలకు పెద్దపెద్ద పదవులు ఇచ్చి .. సామాజిక సాధికారతను నిర్వచించి చూపారు సీఎం జగన్. జగనన్నకు అధికారం రావడం వల్లే మనకందరికీ సాధికారత వచ్చింది. జగనన్న పాలనలో కులమతాల వివక్ష, ప్రాంతం,పార్టీల వివక్ష లేదు. నాడు–నేడు కింద సర్కారు బడులు, ఆస్పత్రులు ఎలా బాగుపడ్డాయో మనకందరికీ తెలుసు. ఇంగ్లీషు మీడియం చదువులు పేదలకు అందుబాటులోకి తెచ్చి, ప్రపంచస్థాయిలో పోటీపడేలా చేశారు జగనన్న. ఎప్పుడు అవకాశం వచ్చినా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు చేయడంలో జగనన్న వెనుకంజ వేసిన రోజే లేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల పదవులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే. మన వర్గాల పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa