వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ టీఎన్ దీపిక హిందూపురం మండలం చౌళూరు గ్రామపంచాయతీలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు చౌళూరు మధుమతి రెడ్డి , సర్పంచ్ నంజప్ప, ఎంపీపీ రత్నమ్మ, ఎంపీటీసీ కృష్ణవేణి ఆధ్వర్యంలో దీపికకు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి దీపిక ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అబివృద్ధి , వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను వివరిస్తూ ఆమె ముందుకు సాగారు. ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం వైయస్ జగన్ ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? లేదా?..అందకపోతే ఎందుకు రాలేదు అని ప్రజలను, వాలంటీర్ల ను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa