నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా.. డ్రైవర్ వినోద్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ముందుగా కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు.
వీరిలో సీతమ్మ (65) అనే వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
పల్టీలు కొట్టిన టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు..
ముందు వెళ్తున్న వాహనం టైరు ఒక్కసారిగా పేలిపోవటంతో.. దాన్ని తప్పించేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ రాజధాని బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం మావిళ్లగూడెం దగ్గర శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మావిళ్లగూడెం వద్దకు రాగానే.. బస్సు ముందు వెళ్తున్న వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తిప్పాడు. అప్పటికే కాస్త వేగంగా ఉన్న బస్సు.. కంట్రోల్ తప్పి పల్టీలు కొట్టింది. అయితే.. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగతావాళ్లంత సురక్షింతగానే బయటపడ్డారు. ఎవరికీ ప్రాణహాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను దగ్గరున్న ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa