మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసేది ప్రజా దీవెన యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...బద్ధపు హామీలతో, అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలను హింసించి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేవలం కబుర్లతో కాలక్షేపంపాదయాత్ర చేస్తూ మళ్లీ ప్రజలను మంత్రి కారుమూరి మోసం చేస్తున్నాడని అన్నారు. ఏం మొఖం పెట్టుకుని ప్రజాదీవెన యాత్ర చేస్తున్నావ్.. ఏం ఉద్ధరించావని ప్రజా దీవెన యాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. కులాలను తిట్టావు, కులాలకు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఆచంటలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సభ గురించి, ఆయన మాట్లాడుతున్నారని.. అసలు తనకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa